Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిలను అదోలా చూసినా అంతే సంగతులు..

మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన

అమ్మాయిలను అదోలా చూసినా అంతే సంగతులు..
, బుధవారం, 15 ఆగస్టు 2018 (12:44 IST)
మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిని చూపులతో చూస్తూ.. ఇబ్బంది పెట్టిన ఓ ఆటో డ్రైవర్‌ను షీ-టీమ్‌ అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పనిచేస్తోంది. గత నెల 25న ఈమె తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. డ్రైవర్‌ మహ్మద్‌ మొహినుద్దీన్‌ ఆటోలో ఉన్న అద్దాన్ని తిప్పుతూ మహిళను చూడసాగాడు. 
 
ఈ వ్యవహారంపై బాధితురాలు  షీ- టీమ్స్‌కు ఫిర్యాదు చేయగా.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 రోజుల జైలు శిక్ష విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన ప్రియుడితో కలిసి తెనాలికి యువతి... గది అద్దెకు తీసుకుని...