Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలాంబరిగా మారిన షర్మిల.. జగన్ పతనాన్ని సైలైంట్‌గా ఆస్వాదిస్తుందా?

ys sharmila

సెల్వి

, శనివారం, 8 జూన్ 2024 (10:47 IST)
వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించాలని చంద్రబాబు నాయుడు అంతగా కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ సొంత సోదరి షర్మిల. కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వివేకా హత్య అంశం, ప్రత్యేక హోదా పోరాట హామీపై జగన్‌ను లక్ష్యంగా చేసుకుని జగన్‌పై కనికరం లేకుండా షర్మిల మాటల దాడి చేశారు. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఉద్దేశ్యంతో షర్మిల పలు బహిరంగ సభలు నిర్వహించారు.
 
జగన్‌కు దిమ్మతిరిగే రీతిలో అధికారం నుంచి దించడంతో ఆమె టార్గెట్ రీచ్ అయింది. జగన్ పతనాన్ని రహస్యంగా ఆస్వాదిస్తున్న షర్మిల నరసింహా నుండి నీలాంబరి మోడ్‌ను కూడా ఆన్ చేసి ఉండవచ్చని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
నరసింహ చిత్రంలో, రమ్య కృష్ణ నీలాంబరి పాత్రను పోషిస్తుంది. ఆమె రజనీకాంత్ పాత్ర పతనాన్ని సైలెంట్‌గా ఆనందిస్తుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల తర్వాత షర్మిల బహిరంగంగా కనిపించకపోవడంతో, ఆమె కూడా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి పతనాన్ని సైలైంట్‌గా ఆస్వాదిస్తున్నారని ప్రజలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. నెట్టింట షర్మిల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు విజయంలో నా రోల్ లేదు.. ఇక ఆ ఫలితాలు అంచనా వేయను..