Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు విజయంలో నా రోల్ లేదు.. ఇక ఆ ఫలితాలు అంచనా వేయను..

prashant kishore

సెల్వి

, శనివారం, 8 జూన్ 2024 (09:12 IST)
ఏపీలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) విజయంలో తన పాత్ర ఏమీ లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తనంతట తానుగా అన్నీ సాధించారని.. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌లో అతని గెలుపులో నేను ఎలాంటి పాత్ర పోషించలేదు. ఈ ఎన్నికలలో నేను అతని కోసం ఎటువంటి ప్రచారాన్ని నిర్వహించలేదు" అని కిషోర్ తెలిపారు. చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించారు. 
 
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తున్నారు. జూన్ 12న ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది."అని చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతారని ముందుగా అంచనా వేసిన వారిలో తానేనని కిషోర్ సూచించారు. 
 
తన మునుపటి ఎన్నికల అంచనాలలో తప్పని ఒప్పుకున్నారు. బీజేపీకి దాదాపు 300 సీట్లు వస్తాయని మేం అంచనా వేసాం, కానీ 240 సీట్లు వచ్చాయి. భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం మానేయాలని నిర్ణయించుకున్నట్లు కిషోర్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను".. ఆ క్షణం కోసం పీకే ఫ్యాన్స్