Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో మే 2న ఎన్నికల కౌంటింగ్‌.. 144 సెక్షన్ అమలు

Advertiesment
Tirupati
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (22:22 IST)
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్.పి వెంకట అప్పల నాయుడు తెలిపారు. 
 
మే 2న ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా బందోబస్తు విధుల్లో 11 మంది డి.ఎస్.పి లు, 14 మంది సి.ఐ లు,30 మంది ఎస్.ఐ లు, 89 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు, 17 మంది హోమ్ గార్డులతో మొత్తం 320 పాటు ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి, సి.ఆర్.పి.ఎఫ్, స్పెషల్ పోలీస్ బలగాల ఉండనున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇక కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుంది అని అన్నారు. ట్రాఫిక్ మళ్ళిoపు... బాలాజీ కాలనీ నుండి ఎస్.వి.యు మెయిన్ గేట్ వరకు ట్రాఫిక్ అనుమతి లేదు. 
 
ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వెంట ఇద్దరు మించి ఉండకూడదు అని చెప్పిన ఆయన విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉన్నట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా బారినపడి కరోనాని జయించిన పోలీస్: విధులకు ఆహ్వానించిన ఎస్పీ