Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలువ‌లోకి దూసుకెళ్ళిన ఎర్ర‌గొండ‌పాలెం ఆర్టీసీ బ‌స్సు

కాలువ‌లోకి దూసుకెళ్ళిన ఎర్ర‌గొండ‌పాలెం ఆర్టీసీ బ‌స్సు
విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:20 IST)
ఇటీవ‌ల వ‌ర్షాల‌కు రోడ్లు అత‌లాకుత‌లం అయిపోయాయి. దీనితో త‌ర‌చు రోడ్డు ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు నుండి ఎర్రగొండపాలెం వెళుతున్నఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది.

రోడ్డు స‌రిగా లేక‌పోవ‌డంతో బ‌స్సు ముందు వైపు టైర్ ఒక్క‌సారిగా పేలిపోయింది. దీనితో బ‌స్సు అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అనుకోని ఈ సంఘ‌ట‌న‌తో వారంతా ప్ర‌మాదంలో ప‌డ్డారు.

కానీ, బ‌స్సు డ్రైవర్ చాకచక్యంతో బండిని ఆపడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం త‌ప్పింది. డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు వివ‌రించారు. బ‌స్సును కాలువ లోంచి బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్, ఎంపీ విజయ సాయిల‌కు ఊర‌ట‌... బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌