Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఓటుకు వెయ్యి, రెండు, ఐదు వేలు ఇవ్వడం విన్నాం. కానీ ఒక ఓటుకు ఏకంగా రూ.40 వేలు ఇస్తున్నారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే. అదెక్కడ అంటారా?.. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం రండీ...
 
ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువ కావడంతో.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు.

ఎన్నికల వేళ.. ఆ గ్రామంలోని ఓటర్లకు పండగనే చెప్పాలి. గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు.. రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు.

ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి పోటీలో తలపడుతోన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో కేవలం 110 మంది ఓటర్లే ఉండగా, వీరిద్దరూ చెరొక రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని మహిళపై పార్కింగ్ చేసిన బస్సులో బలాత్కారం!