Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు

పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:40 IST)
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని తెదేపా అధినేత చంద్రబాబు.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రికి నరేంద్ర సింగ్ తోమర్​కు లేఖ రాశారు.

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2014 -19 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం రూ.1845 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు తన వాటా నిధులు విడుదల చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు