పవన్ కళ్యాణ్ 'గుండు'... మంత్రి పరిటాల సునీత ఏం చెప్పారో తెలుసా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనంలోకి ఎంట్రీ ఇచ్చుకుని గతంలో జరిగిన అవాస్తవ ప్రచారాలను, పీఆర్పీలో జరిగిన అసలు సంగతులను చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు పరిటాల రవి గుండు కొట్టించారంటూ ఆమధ్య జరిగిన ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తెదేపాలోని కొందరు నే
Publish Date: Mon, 11 Dec 2017 (15:51 IST)
Updated Date: Mon, 11 Dec 2017 (15:54 IST)
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనంలోకి ఎంట్రీ ఇచ్చుకుని గతంలో జరిగిన అవాస్తవ ప్రచారాలను, పీఆర్పీలో జరిగిన అసలు సంగతులను చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు పరిటాల రవి గుండు కొట్టించారంటూ ఆమధ్య జరిగిన ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెదేపాలోని కొందరు నేతలే ఇలాంటి అబద్ధపు ప్రచారం చేశారని కూడా వెల్లడించారు.
ఇదిలావుంటే దీనిపై పదేళ్ల క్రితమే పరిటాల రవి మాట్లాడారు. జూబ్లిహిల్స్ ప్రాంతంలో తన స్థలం ప్రక్కనే ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు చిరంజీవి ప్రయత్నించారనీ, ఐతే దాన్ని తను వారించినట్లు వెల్లడించారు. ఆ స్థలాన్ని కొంటే, అది తమ ఇంటి పక్కనే వుంటుంది కనుక, అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని తన మనుషులు తనిఖీలు చేసే అవకాశం వుంటుందనీ, అందువల్ల దాన్ని కొనుగోలు చేయవద్దని తను చెప్పానని వెల్లడించారు. దానితో చిరంజీవి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారని వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా మంత్రి పరిటాల సునీత కూడా దీనిపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చెప్పినదే వాస్తవమన్నారు. ఆయనకు పరిటాల రవి గుండు చేయించారన్నది అవాస్తవమనీ, ఎవరో అలా అసత్య ప్రచారం చేశారని అన్నారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతోనే పార్టీకి మద్దతు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More