Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు రెండో విడత జనవాణి కార్యక్రమం ప్రారంభం

pawan kalyan
, ఆదివారం, 10 జులై 2022 (13:33 IST)
జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జనవాణి రెండో విడత కార్యక్రమం అదివారం విజయవాడ నగరంలో ప్రారంభమైంది. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం గత వారం నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో రెండో విడత కార్యక్రమం కూడా ఆదివారం విజయవాడలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో పవన్‌కు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. 
 
అలాగే, వచ్చే వారం భీమవరంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. పాలకులకు ప్రజా సమస్యలు విన్నవించుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పవన్ గతంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక అధ్యక్ష భవనంలో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు