Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవుళ్ళకు కులాలను ఆపాదిస్తారా.. మీరు మనుషులేనా? పరిపూర్ణానంద(వీడియో)

మఠాధిపతులు, పీఠాధిపతుల్లో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు. గత కొన్నిరోజులకు ముందు దేవుళ్ళు ఏ కులం వారు అంటూ ఒక్కొక్క దేవుడి గురించి వారి కులం గురించి కొంతమంది వ్యాఖ్యానిస్తే

Advertiesment
Paripurnananda
, సోమవారం, 5 మార్చి 2018 (20:05 IST)
మఠాధిపతులు, పీఠాధిపతుల్లో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు. గత కొన్నిరోజులకు ముందు దేవుళ్ళు ఏ కులం వారు అంటూ ఒక్కొక్క దేవుడి గురించి వారి కులం గురించి కొంతమంది వ్యాఖ్యానిస్తే ఆ విషయంపై తీవ్రంగా స్పందించారు. దేవుళ్ళకు కులాలను ఆపాదించడం చాలా తప్పు. అసలలా మాట్లాడిన వారు మనుషులేనా అంటూ ప్రశ్నించారు. 
 
అంతే కాదు దళితులను రాక్షసులుగా వర్ణిస్తూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఖండించారు. సన్యాసులకే కులం లేనప్పుడు..దేవతలకు కులం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. టిటిడిలో నోటీసులు అందుకున్న 44మంది అన్యమత ఉద్యోగస్తులకు అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం ధర్మ ప్రచార విధానాన్ని పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్లే గ్రామాల్లో మతమార్పిడులు జరుగుతున్నాయని చెప్పారు. 
 
మతమార్పిడులను అరికట్టడానికి శ్రీ పీఠం ఆధ్వర్యంలో గ్రామగ్రామంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎపిలోని 14,276గ్రామాల్లో సంధ్యా గురుకులాలను విస్తరిస్తామని,  శ్రీ పీఠం తరపున మండస్థాయిలో గోశాలల ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ఇస్లామిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని, ఇదే  విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని పరిపూర్ణానందస్వామి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19 అంశాలు కేంద్రం పరిష్కరించాలి... డొక్కా మాణిక్యవరప్రసాద్