Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ
, మంగళవారం, 9 జనవరి 2018 (09:40 IST)
జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించారు. 
 
జాతిపిత హత్య కేసును జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. మహాత్మా గాంధీ హత్యలో ఓ విదేశీ సంస్థ హస్తం ఉందని, ఈ కేసును తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన అమికస్ క్యూరీగా అమరేంద్ర శరణ్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 
 
కానీ కేసు పునర్విచారణ అవసరం లేదని శరణ్ తన నివేదికలో స్పష్టంచేశారు. విదేశీ సంస్థ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. గాంధీ శరీరంలోకి దిగిన బుల్లెట్లు, ఏ పిస్తోలు నుంచి వాటిని ఫైర్ చేశారు.. ఎవరు కాల్చారు.. దాని వెనుక కుట్ర.. ఇలా అన్నింటినీ స్పష్టంగా గుర్తించారు.
 
గాడ్సే కాకుండా మరో అజ్ఞాత వ్యక్తి గాంధీ హత్యలో పాలుపంచుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. గాంధీ శరీరంలో దిగిన నాలుగో బుల్లెట్ ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్చిందని, దానివల్లే ఆయన మరణించారన్న పిటిషనర్ వాదనను కూడా శరణ్ తోసిపుచ్చారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హఫీజ్ క్యాలెండర్‌: పాక్ పత్రికలు కూడా కొమ్ముకాస్తున్నాయా?