Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా మారిన జగన్ బంధువు... ఎవరు?

ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర

పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా మారిన జగన్ బంధువు... ఎవరు?
, శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:54 IST)
ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా వైవీ సుబ్బారెడ్డి తయారయ్యారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
 
ప్రకాశం జిల్లాలో వైకాపా అనేదిలేకుండా చేయడానికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉన్న అస్తులు కరిగిపోయాయి... ఇప్పుడు మీకు నేను నాయకుడిగా పనికిరాలేదా... మీకు బానిసలు కావాలని ఇన్‌చార్జి పదవి వేరొకరికి ఇస్తారా? ఇది సమంజసమా? అంటూ నిలదీశారు. 
 
ముఖ్యంగా, అప్పుతెచ్చానో? ఉన్నదే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం వెచ్చించాను అంటూ వాపోయారు. దళితుల రక్తమాంసాల మీద ఎంపీ కోట కట్టుకుంటారా? ఒక్క దళితులకే కాదు, బీసీలకు అన్యాయం చేస్తావా? అంటూ వైవీనిని అశోక్ బాబు దునుమాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో బాహుబలి - భళ్లాలదేవ యుద్ధం.. ఎప్పుడో తెలుసా?