Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూతన్ నాయుడు - మధుప్రియ మళ్లీ అరెస్టు...

నూతన్ నాయుడు - మధుప్రియ మళ్లీ అరెస్టు...
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:50 IST)
విజయవాడలో ఓ దళిత యువకుడికి శిరోమడనం చేసిన కేసులో అరెస్టు అయిన టాలీవుడ్ చిత్ర నిర్మాత నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియలు మరోమారు అరెస్టు అయ్యారు. తొలుత శిరోమండన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ దఫా ఓ మోసం కేసులో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. 
 
కాగా, తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్టు చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడుగుల సమస్యలపై మడమతిప్పని పోరాటం : పాశ్వాన్ మృతిపై నేతల సంతాపం