Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం

అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టం
, బుధవారం, 17 జూన్ 2020 (09:18 IST)
టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్‌ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది.

ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ టి. కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు ఐపీసీ సెక్షన్‌ 354-(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 క్రింద కూడా కేసు నమోదు చేసినట్లు స్థానిక సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ తెలిపారు.

అలాగే, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అయ్యన్నను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3T అమలుతోనే కరోనా అదుపు!