Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో మరో 26 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో మరో 26 వేల కరోనా పాజిటివ్ కేసులు
, బుధవారం, 16 డిశెంబరు 2020 (10:42 IST)
దేశంలో మరో 26 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 26,382 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,32,548కు చేరింది. ఇక గత 24 గంటల్లో 33,813 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 387 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,096కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,56,449 మంది కోలుకున్నారు. 3,32,002 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,66,46,280 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,85,625 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
కాగా, తెలంగాణలో గత 24 గంటల్లో 536 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 622 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,135 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,70,450 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,502కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,041 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 62,57,745 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దివస్ : ఇండో-పాక్ యుద్ధం : బంగ్లాదేశ్ ఆవిర్భావం