Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన
, ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:19 IST)
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలను నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్టం రాజు సందర్శించారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్లు ఉన్నారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో మంత్రి, ఎంపీలు పర్యటించి, స్థానికులను, అధికారులను అప్రమత్తం చేశారు. 
 
ఆచంట నియోజకవర్గంలో వశిష్ఠ గోదావరి పరీవాహక లంక గ్రామాలైన పెద్దమలం లంక, పుచ్చల లంక, రవి లంక, మార్రిముల, అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్నా ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. 
 
వరద ఉధృతి పెరిగితే లంక గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్ ఫిషర్ ఖాతాలో మోసం.. పలు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా