Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనారోగ్యంతో జ్యోతుల నెహ్రూ : వైకాపా ఎంపీ వీడియో కాల్

Advertiesment
Narsapuram MP
, గురువారం, 19 ఆగస్టు 2021 (15:27 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పలువురు నేతలు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ నేతలు కూడా ఉన్నారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెహ్రూను మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డిలు పరామర్శించారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. 
 
ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చాలా మంది టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి నెహ్రూను పరామర్శించారు. అయితే.. ఆయన వద్దకు వైఎస్సార్ సీపీ నేతలు చర్చనీయంగా మారింది. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నెహ్రూ ఆరోగ్య పరిస్థితిపై అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వకవి పట్ల వివక్ష : నోరుజారిన కేంద్ర మంత్రి సుభాష్