ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం-యూకే మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో కొత్త యుగం ప్రారంభానికి దారితీసే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందం (CETA)పై సంతకం చేస్తున్నందున, ఏపీ విద్య- ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ పోస్టులో ఎక్స్లో ఈ మేరకు మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. "భారతదేశం-యునైటెడ్ కింగ్డమ్ చరిత్ర లోతైన సంబంధాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రోజు మనం ఆ సంబంధంలో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నాము.
భారతదేశం-యూకే సమగ్ర ఆర్థిక-వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇది 99శాతం టారిఫ్ లైన్లపై జీరో-డ్యూటీ యాక్సెస్తో భారతీయ వస్తువులకు అపూర్వమైన మార్కెట్ యాక్సెస్ను అందించింది. ఇది వాణిజ్య విలువలో దాదాపు వంద శాతం కవర్ చేస్తుంది.
ముఖ్యంగా, ఏపీ విలువైన ఆక్వా పరిశ్రమ యూకేలోకి గణనీయమైన మార్కెట్ యాక్సెస్ను పొందుతుంది. తగ్గిన సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది." అని నారా లోకేష్ అన్నారు.