Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

Advertiesment
mp daily coolie

ఠాగూర్

, శుక్రవారం, 25 జులై 2025 (08:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ దిన కూలీకి అదృష్టం తలుపుతట్టింది. రాష్ట్రంలోని పన్నాలో రోజూ కూలీ పనులు చేసుకుని పనిచేసే హర్‌గోవిద్ అనే కూలీకి నిసార్ గనిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 వజ్రాలు లభించాయి. వాటి ధర సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, ఛతర్‌పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్‌గోవింద్, పవన్ ‌దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు. వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. 
 
వాటి విలువ నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోగా మిగతా డబ్బులు గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. దీనిపై హర్‌గోవింద్ మాట్లాడుతూ, భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలోనూ ఓ వజ్రం లభించింది. అపుడు తెలియక కేవలం రూ.లక్ష మాత్రమే నాకు ఇచ్చారు అని వివరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...