Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు

Babu
, సోమవారం, 23 అక్టోబరు 2023 (16:59 IST)
టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో వున్న చంద్రబాబును నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. 
 
చెడుకి పోయేకాలం ద‌గ్గర ప‌డ‌టం ద‌స‌రా సందేశమన్న ఆయన, ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దామని పిలుపునిచ్చారు. మరోవైపు నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ధరలకు బ్రేక్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు