Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ‌న‌వ‌రి 2న నాద‌ నీరాజ‌నం

జ‌న‌వ‌రి 2న నాద‌ నీరాజ‌నం
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:14 IST)
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 2వ తేదీన 8వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.
 
శ‌నివారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 195 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.
 
శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం సేవించి వాహనాలు నడిపితే పదేళ్ల జైలు: సీపీ సజ్జనార్