Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల కలకలం

Advertiesment
Mysterious Deaths
, శనివారం, 12 మార్చి 2022 (19:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 18 మంది మృత్యువాతడటం ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 
 
తొలి మరణం సంభవించినపుడు కల్తీకల్లు తాగి చనిపోయారని భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఎక్కడా కూడా కల్తీ కల్లు ఆనవాళ్ళు కనిపిచలేదు. ఆ తర్వాత మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. 
 
అయితే, రోజురోజుకూ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టినిసారించింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో అన్వేషించే పనిలో నిమగ్నమైంది. జిల్లా వైద్యాధికారులతో పాటు పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.
 
అయితే వైద్యులు మాత్రం కిడ్నీల సమస్యలతో వస్తున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోతున్నట్టు ఓ అంచనాకు వచ్చారు. అందుకు మద్యం సేవించడం, దాని ప్రభావం కిడ్నీలపై పడటంతో ఈ సమస్య తలెత్తుతున్నట్టు తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఎస్ఈ ఫస్ట్ టర్మ్ ఫలితాలు వెల్లడి