Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు
, శనివారం, 17 జులై 2021 (15:25 IST)
గ‌త కొద్ది రోజులుగా గుండెపోటుతో చికిత్స పొందుతున్న బ‌చ్చుల అర్జునుడిని చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించారు. రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ, బచ్చుల అర్జునుడుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప‌రామ‌ర్శించారు.

అర్జునుడు ఆరోగ్య వివరాలు వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అర్జునుడు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. చంద్ర‌బాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ  కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టేం రఘురామ వున్నారు.

ఇంకా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామ చిన్నబాబు, టీడీపీ నాయకులు దేవినేని చందు, తదితరులు బ‌చ్చుల అర్జునుడిని క‌లిసారు. ఆయ‌న క్షేమ స‌మాచారం తెలుసుకున్న నేత‌లు, ఆయ‌న త్వ‌ర‌గా రిక‌వ‌రీ కాల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్లు మీడియాకు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారామిలటరీలో వీఆర్‌ఎస్‌లు అధికమే