Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వదినతో గొడవపడిన మరిది.. కత్తితో దాడి చేశాడు..

వదినతో గొడవపడిన మరిది.. కత్తితో దాడి చేశాడు..
, శుక్రవారం, 12 జూన్ 2020 (12:12 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వదినతో గొడవపడిన మరిది ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వదిన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట ప్రగతినగర్‌కు చెందిన మరక మంజులాదేవి (37) జలమండలిలో డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పని చేసేది. ఆమె భర్త విష్‌దేవ్‌లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె వరణియ తేజ, అత్త జ్యోతితో కలిసి ఉంటోంది.
 
గురువారం ఉదయం మరిది నారదేవ్‌తో ఇంట్లో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆగ్రహానికి లోనైన నారదేవ్‌ కత్తితో మంజులాదేవిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. 
 
దీనిని గుర్తించిన అమె కుమార్తె సమీపంలో ఉంటున్న మంజులాదేవి సోదరికి సమాచారం అందించడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం అపోలో డీఆర్‌డీఓ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య