Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‌పబ్‌జీ గేమ్‌ వల్ల యువకుడు పిచ్చోడైపోయాడు.. ఎక్కడ?

‌పబ్‌జీ గేమ్‌ వల్ల యువకుడు పిచ్చోడైపోయాడు.. ఎక్కడ?
, బుధవారం, 10 జూన్ 2020 (14:20 IST)
పబ్‌జీ గేమ్‌కు బానిసలైపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ గేమ్‌తో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ను అదేపనిగా ఆడితే ఎంతగా నష్టపోతామో తెలిపే మరో ఘటన విశాఖలో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్‌కు బానిసై అదేపనిగా ఆడడం వల్ల ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు. విశాఖలోని అరకులోయ ప్రాంతానికి చెందిన కౌశిక్‌ అనే యువకుడు పదేపదే పబ్జీ గేమ్‌ ఆడేవాడు. 
 
ఇటీవల ఆ గేమ్‌ ఆడుతోన్న సమయంలో ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరినీ గుర్తు పట్టలేని స్థితికి అతడు వెళ్లిపోయాడని వైద్యులు తెలిపారు. బాధితుడికి చికిత్స కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 
 
పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. ప్రస్తుతం దీంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అతడికి వైద్యులు ప్రథమ చికిత్సచేసిన అనంతరం... పబ్జీ గేమ్‌ వల్ల అతడు మతిస్థిమితం కోల్పోయాడని తెలిపారు. 
 
అతడిని చికిత్స నిమిత్తం విశాఖ తరలించాలని సూచించారు. అయితే పబ్ జీ ఆటలో లీనమైన వీరంతా తాము ఏం చేస్తున్నామన్న విషయం కూడా గమనించలేదని పోలీసులు తెలుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్యలో రామ మందిరం.. పునాది రాయి పడింది..