Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో చిరుత కలకలం.. భక్తుల్లో భయం భయం..

Leopard
, గురువారం, 13 జులై 2023 (12:11 IST)
తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు సంచరించడం భక్తుల్లో భయాందోళనలనకు రేకెత్తెస్తోంది. గత నెలలో మూడేళ్ల ఏళ్ల బాలుడిని చిరుత పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే.. ఈ క్రమంలో నిన్న రాత్రి తిరుపతి కొండ దారిలో చిరుతపులి సంచరించింది. ఇది చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. 
 
దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ ప్రారంభించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో వలలతో కంచె కూడా వేశారు. దీంతో ఈ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పైకి చిరుతపులి రాకుండా అడ్డుకోవచ్చని దేవస్థానం భద్రతా అధికారులు తెలిపారు. కొండ మార్గంలో మళ్లీ చిరుతలు రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
 
తిరుమల కొండదారిలో చిరుతలు సంచరించడంతో రాత్రిపూట కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో భద్రత కోసం సాయుధ పోలీసులను నియమించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు బోగీలో చెప్పులతో కొట్టుకున్న మహిళలలు .. వీడియో వైరల్