Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లక్ష్మీ పార్వతికి కీలక పదవి.... రేపు షకీలాకు కూడా ఇస్తారేమో?

లక్ష్మీ పార్వతికి కీలక పదవి.... రేపు షకీలాకు కూడా ఇస్తారేమో?
, బుధవారం, 6 నవంబరు 2019 (17:32 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ తెలుగు అకాడెమీ ఛైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మరణం తర్వాత అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని వైకాపాలో విలీనం చేసి, వైకాపా మహిళా నేతల్లో కీలకంగా మారారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకుని టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమెకు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ లక్ష్మీపార్వతిని ఏపీ అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, లక్ష్మీ పార్వతికి పదవిపై టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మున్ముందు నటి షకీలాకు కూడా ఓ మంచి పదవి అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వారు సెటైర్లు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత రాజ్యాంగానికి వయసు 7 పదులు.. 26న ప్రత్యేక పార్లమెంట్