Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు

Advertiesment
Kurnool
, సోమవారం, 7 మార్చి 2022 (14:28 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆందోనీ మండలం నారాయణపురం గ్రామం పొలాల్లో వేటగాళ్లు పట్టపగలే రెచ్చిపోయారు. ఈ గ్రామ పొలాల్లో తిరిగే జింకల మందపై తుపాకులతో విరుచుకపడ్డారు. దీంతో వేటగాళ్ల తుపాకీ తూటాలకు ఏకంగా 12 జింకలు మృత్యువాతపడ్డాయి. వేటగాళ్లు దుండగులు జీప్‌లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటాలు తగిన జింకలు నేలకొరిగాయి. 
 
ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తులతై జింకల తలలను వేరు చేసి మిగిలిన మొండెంతో పారిపోయారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగింది. ఈ వేటగాళ్ళ దుశ్యర్యలను చూసిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడకు వచ్చి మొండెం నుంచి వేరు చేసిన జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే వేటగాళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద‌ళిత బంధు ప‌థ‌కానికి రూ.17,700 కోట్లు.. ఎలా అప్లై చేసుకోవాలి?