Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలం మారింది.. ఏపీ ఓటర్లు భేష్.. చంద్రబాబులా వుండాలి: కేటీఆర్

ktrao

సెల్వి

, మంగళవారం, 23 జులై 2024 (22:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల నాటికి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ గతంలో బీఆర్ఎస్‌కు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బద్ధశత్రువులు. బీఆర్ఎస్ వైకాపా చీఫ్ జగన్‌కు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జగన్ ఏపీలో మళ్లీ గెలవాలని మాత్రం ఎదురుచూశారు. 
 
కానీ కాలం మారింది. ఈ రోజుల్లో తెలంగాణ ఓటర్లకు ఏపీని ఉదాహరణగా చూపుతున్నారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారో, అలాగే ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు ఇవ్వడమే ముఖ్యమని, వీలైనంత వరకు నిధులు గుంజుకోవాలని కేటీఆర్ చెబుతున్నారు.
 
మంగళవారం కేంద్ర బడ్జెట్‌ గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ, ఇది కేంద్ర బడ్జెట్‌ అయినా, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. పక్క రాష్ట్రానికి మంచి నిధులు వస్తున్నా సరే, తెలంగాణను మరోసారి విస్మరించారు. 
 
ఏపీకి నిధులు ఇచ్చే సమయంలో ఆర్థిక మంత్రి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రస్తావించారని, అయితే తెలంగాణ కూడా విభజనలో భాగమని గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేదు. 
 
ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్.. జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు ఇస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్షిక బడ్జెట్ ఎఫెక్ట్ : పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు.. యూజర్లపై మరోమారు బాదుడు?