Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌జ‌ల‌పై, డాక్ట‌ర్ల‌పై ఆమంచి కృష్ణమోహన్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

ప్ర‌జ‌ల‌పై, డాక్ట‌ర్ల‌పై ఆమంచి కృష్ణమోహన్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:28 IST)
2019 సాధారణ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ అతని కుటుంబం చేసిన అరాచకాల కారణంగానే చీరాల ప్రజలు ఆమంచిని పక్కన పెట్టారని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.

అయినా ఏమాత్రం పద్ధతి మార్చుకోని ఆమంచి అధికార పార్టీని అడ్డుపెట్టుకొని ప్రజలపై, వ్యాపారస్తులపై, డాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం చీరాల కొత్తపేట రోడ్ లోని రామానాయుడు పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ, సేవా సంస్థ అధ్యక్షులు కోటి ఆనంద్, బహుజన ప్రజాస్వామ్య వేదిక నాయకులు దుడ్డు విజయ్ సుందర్, బీసీ యువజన సంఘం నాయకులు కొల్లిపర వెంకటేష్, వైసిపి యువ నాయకులు గోసాల అశోక్, వై.ప్రసాదు, విశ్రాంత ఉపాధ్యాయులు ఎస్‌జె చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గంలో కరో నా పరిస్థితులను అడ్డంపెట్టుకుని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఆమంచిని ప్ర‌శ్నిస్తున్నందుకు, వ్యాపారస్తులపై, డాక్టర్లపై తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అష్టదిగ్బందంనం లో నరసరావుపేట