Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేఈ చర్యలు

సింహాచలం పరిధిలోని పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల ఆధీనంలో వుంది. సమస్య పరిష్కారానికి వున్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరు

సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేఈ చర్యలు
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (19:08 IST)
సింహాచలం పరిధిలోని పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల ఆధీనంలో వుంది. సమస్య పరిష్కారానికి వున్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరుకు ఉపముఖ్యమంత్ర ఆదేశించారు. రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సి.ఎం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సమీక్ష  నిర్వహించారు. 
 
సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, సి.సి.ఎల్.ఏ అనిల్ చంద్ర పునేఠా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ మరియు దేవదాయ శాఖ కమీషనర్ డా.పద్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పంచగ్రమాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలనే అంశంపై చర్చ జరిగింది. 
 
ప్రస్తుతం ఇనామ్ చట్టం ప్రకారం స్థానిక గ్రామాల సమస్యకు పరిష్కారం చూపించలేమని, హైకోర్టు ద్వారానే పరిష్కరించగలమని కలెక్టర్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 1968లో అప్పటి ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ 5 గ్రామాలను ఇనామ్ గ్రామంగా తప్పుగా నమోదు చేశారని, వాస్తవంగా ఆ భూమి మొత్తం ఎస్టేట్ ల్యాండ్ కిందకి వస్తుందని, వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపించారు. గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులతో పాటు రైతుల దగ్గర ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని వారం రోజుల్లో నివేదిక  సమర్పించాలని సి.సి.ఎల్.ఏ కలెక్టర్‌ను ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుందామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభోదానందతో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందట : జేసీ దివాకర్ రెడ్డి