Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపు ఉద్యమం కొత్త పంథా తొక్కనుందా...?

కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్న

కాపు ఉద్యమం కొత్త పంథా తొక్కనుందా...?
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (19:53 IST)
కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్నారు కూడా. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని తన అధికారంతో అణగదొక్కగలిగాడు కానీ, కాపుల్లో అసంతృప్తిని, టిడిపిపై ద్వేషాన్ని తగ్గించలేకపోయాడని వాపోతున్నారు ముద్రగడ అభిమానులు.
 
భవిష్యత్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాపు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిమీద ముద్రగడ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఐక్యకార్యాచరణ కమిటీ కీలక సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాపుల వ్యూహం ఏమిటి? గతంలో మోసం చేసిన పార్టీని గద్దె దింపేందుకు ఏం చేయాలి?
 
కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఇలాంటివాటిపై జెఏసీ నిర్ణయం ప్రకారం ప్రణాళిక ఉంటుందని ముద్రగడ పద్మనాభం ప్రకటించడం సంచలనాన్ని రేపింది. చంద్రబాబునాయుడు కాపు జాతికి చేసిన అన్యాయం దేశంలో ఎవ్వరికీ జరిగి ఉండదని ఈ సందర్భంగా ఉద్యమనేత ముద్రగడ ఆవేదనతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ అన్నా... నన్ను కాపాడన్నా... శ్రీరెడ్డి కన్నీళ్లు(Video)