Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

Advertiesment
kakani

ఠాగూర్

, సోమవారం, 9 జూన్ 2025 (12:49 IST)
వైకాపా సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే రహదారిపై అక్రమంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కంటైయినర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరో కేసు నమోదు చేయడం గమనార్హం. అలాగే, అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్