Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజధాని రైతులకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే

Advertiesment
Pawan Kalyan
, మంగళవారం, 23 ఆగస్టు 2022 (12:50 IST)
ఏపీకీ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా వుండాలని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధాని రైతులు మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. 
 
ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకునేందుకు చేప‌ట్ట‌నున్న రెండో విడ‌త పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రైతులు ఆయ‌న‌ను కోరారు. ఇందుకు పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 
 
సెప్టెంబ‌ర్ 12 నుంచి నవంబ‌ర్ 14 వ‌ర‌కు అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి వ‌ర‌కు రాజ‌ధాని రైతులు రెండో విడ‌త పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. 
 
రాజ‌ధాని రైతుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న ప‌వ‌న్‌.. రైతుల పాద‌యాత్ర‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌కటించారు. రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని, అది అమ‌రావ‌తే కావాల‌ని కూడా ప‌వ‌న్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో డీఎస్సీ 2022 నోటిఫికేషన్ విడుదల