Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

ఆర్థిక నేరాలపై విచారణ, విజసాయిరెడ్డికి వెన్నులో వణుకు: బుద్దా వెంకన్న

Advertiesment
Investigation
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:36 IST)
ఆర్థికనేరాల కేసు విచారణను ఏడాది లోపే పూర్తిచేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అందువల్లే న్యాయవ్యవస్థపై దాడిని మొదలుపెట్టారని అన్నారు. 11 చార్జ్ షీట్లు, లక్షకోట్ల దోపిడీ, సూట్కేసు కంపినీల సూత్రధారి, క్రిడ్‌ప్రోకో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చిన విజసాయిరెడ్డి, జగన్‌లు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడం వింతగా ఉందని విమర్శించారు.
 
లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకు భంగం కలుగుతుందంటూ మీడియాలో కేసు వివరాలు ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను కోరిన జగన్, విజయసాయి ఈరోజు పత్రికా స్వేచ్చ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు.
 
మీడియా గొంతులను నొక్కుతూ జీవో తీసుకొచ్చిన జగన్ వివిధ కేసుల్లో వివిద కోర్టులు అనేక సందర్భాల్లో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను తప్పుపట్టడం న్యాయస్థానాలను కించపరచడమే అవుతుందని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మృతి