Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలర్ట్: తుపానుగా మారే అవకాశం-ఏపీలో భారీగా వర్షాలు

Advertiesment
అలర్ట్: తుపానుగా మారే అవకాశం-ఏపీలో భారీగా వర్షాలు
, మంగళవారం, 22 మార్చి 2022 (11:19 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా కనిపిస్తున్నాయి. తర్వాత 12గంటల్లో తుపాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.
 
బుధవారం తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర వాయుగుండం ఏర్పడిన కారణంగా ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లిలో 65.5 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 38.75, ప్రకాశం జిల్లా కనిగిరిలో 37, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో 35మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెప్తున్నాయి. విజయనగరం, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కేంద్రం శుభవార్త: రాష్ట్రానికి ఏడు ఈఎస్ఐ ఆస్పత్రులు మంజూరు