Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటికి తుఫానుగా మారనున్న అసానీ అల్పపీడనం

రేపటికి తుఫానుగా మారనున్న అసానీ అల్పపీడనం
, ఆదివారం, 20 మార్చి 2022 (15:40 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త సోమవారానికి తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఇది అండమాన్ సముద్ర తీరానికి దక్షిణ దిశగా ఉంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిక్కులో కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడనం శనివారం మరింతగా బలపడి వాయుగుండం మారుతుందని తెలిపింది. ఈ నెల 21వ తేదీ నాటికి తుఫానుగా మారుతుందని, దీనికి అసానీ అనే పేరు పెట్టినట్టు ఐఎండీ వెల్లడించింది. 
 
కాగా, ఆదివారం ఉదయానికి పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం నెలకొనివుంది. మార్చి 22వ తేదీ నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు తాకొచ్చని ఐఎండీ తెలిపింది. దీనివల్ల అండమాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోళి వేళ విషాదం : నదిలోకి స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు