Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్కరు చనిపోయినా కోటి ఇవ్వాల్సిందే.. ఏపీ సర్కార్‌కు సుప్రీం హెచ్చరిక

ఒక్కరు చనిపోయినా కోటి ఇవ్వాల్సిందే.. ఏపీ సర్కార్‌కు సుప్రీం హెచ్చరిక
, గురువారం, 24 జూన్ 2021 (13:11 IST)
పరీక్షల సందర్భంలో ఎవరైనా విద్యార్థులు మరణిస్తే ఒకొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ విచారణను జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇప్పటికే 10,12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి.

మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. ప్రతి గదిలో 15 నుంచి 18 మందికి పరీక్షలు నిర్వహిస్తే ..34, 634, రూమ్స్  ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది.

పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఒకింత హెచ్చరించిన విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతాం: సీఆర్పీఎఫ్