Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటరి మహిళను జుట్టుపట్టి పొదల చాటుకు లాక్కెళ్లి అత్యాచారం...

Advertiesment
Hyderabad Rape Case
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:47 IST)
ఒంటరిగా వెళుతున్న మహిళను జుట్టుపట్టుకుని పొదల చాటుకు లాక్కెళ్లి అత్యాచారం జరిపారో నలుగురు కామాంధులు. ఈ దారుణం హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిశా, బొలంగీర్‌ జిల్లా, మలాపంముండా గ్రామానికి చెందిన రాహుల్‌ మజ్జీ (25), అదే ప్రాంతానికి చెందిన మనోజ్‌ సామ్రాట్‌(23), దుర్గా సామ్రాట్‌(20), ఒడిశా, బొలంగీర్‌ జిల్లా, తెతెల్‌కుట్టికి చెందిన దయా మజ్జీ(20) అనే వ్యక్తులు ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగులదోని తండాలో నివాసముంటున్నారు. వీరు సమీపంలోని జేఎంబీ బ్రిక్స్‌ కిల్‌న్స్‌ కంపెనీలో కూలీలుగా పని చేస్తున్నారు. 
 
అయితే, ఈ నెల 16వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో నాగులదోనితండా సమీపంలో ఓ మహిళ(30) కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఒంటరిగా వెళ్లింది. ఆ మహిళను గమనించిన రాహుల్‌ మజ్జీ, మనోజ్‌ సామ్రాట్‌, దుర్గా సామ్రాట్‌, దయ మజ్జీ ఆమెను వెంబడించారు. ఆ తర్వాత ఆమెను పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న పొదల చాటుకు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ కామాంధుల నుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో నలుగురు నిందితులను అకన్‌పల్లిలోని ఎమ్‌పీఎస్‌ బ్రిక్స్‌ కిల్‌న్స్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా మహిళపై లైంగికదాడికి పాల్పడినట్టు అంగీకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింఛను కోసం కుటుంబ పెద్దను ఉమ్మెత్తకాయ పొడితో చంపేశారు...