Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాసబ్ ట్యాంక్‌ వద్ద ట్రావెల్స్ బస్సుపై పడిన ఎలక్ట్రిక్ పోల్

మాసబ్ ట్యాంక్‌ వద్ద ట్రావెల్స్ బస్సుపై పడిన ఎలక్ట్రిక్ పోల్
, ఆదివారం, 21 నవంబరు 2021 (12:38 IST)
హైదరాబాద్ నగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి హానీ జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
కానీ, ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుపై పడిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, బస్సును పక్కకు తీశారు. ఆ తర్వాత వాహన రాకపోకలను పునరుద్ధరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి