Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...

మే 2న పెళ్లైతే ఇపుడు మూడు నెలల గర్భం ఎలావస్తుంది.. అందుకే చంపేశా...
, మంగళవారం, 30 జులై 2019 (11:05 IST)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ దారుణం జరిగింది. మే నెల రెండో తేదీన వివాహం చేసుకున్న ఓ యువతి ఇపుడు మూడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త ఆమెన పాశవికంగా చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అదే ప్రాంతంలో బీరువాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఆదోని మండలానికి చెందిన రజియాబాను అనే యువతినిచ్చి గత మే నెల రెండో తేదీన వివాహం చేశారు. 
 
అయితే, ఇటీవల రజియాబాను అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. రజియాబాను మూడు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. 
 
అప్పటి నుంచి నిత్యం వేధిస్తూ వచ్చిన మహబూబ్... సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిపి హత్య చేశాడు. ఆపై తన ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, మహబూబ్‌ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రజియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వెల్లడించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోనాల జాతర : ఎస్ఐ బుగ్గపై గబుక్కున ముద్దుపెట్టిన అకతాయి