Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు?: బీజేపీ

భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు?: బీజేపీ
, గురువారం, 19 డిశెంబరు 2019 (06:21 IST)
మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలి గానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు. మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

కర్నూల్​లో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ ముందు నుంచీ మద్దతు తెలుపుతోందన్న జీవీఎల్... హైకోర్టు ఉన్నంత మాత్రాన ఓ ప్రాంతాన్ని రాజధానిగా చూడలేమన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నామనీ.. రాజకీయ, సామాజిక కోణాల్లో తీసుకునే నిర్ణయాలను స్వాగతించేది లేదని స్పష్టం చేశారు.

రాజధాని కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలిగానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండగలకు ప్రత్యేక రైళ్లు