Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య వేరొక వ్యక్తితో అలా వుండటం చూసి.. భర్త ఏం చేశాడంటే?

భార్య వేరొక వ్యక్తితో అలా వుండటం చూసి.. భర్త ఏం చేశాడంటే?
, శనివారం, 16 మే 2020 (13:40 IST)
దేశంలో రెండు లాక్ డౌన్‌లు కొంత మేరకు మేలే చేశాయి. నేరాల సంఖ్యను తగ్గించాయి. అయితే మూడో లాక్ డౌన్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. సడలింపులతో వున్న ఈ లాక్ డౌన్‌‌తో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ గుంటూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా రేపల్లెలో సౌజన్య అనే అమ్మాయి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో భర్త చేతిలోనే హత్యకు గురైంది. 
 
కట్టుకున్న భర్తే తనను దారుణంగా హత్య చేశాడు. గత అర్థరాత్రి సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వీరేంద్ర కూడా పురుగుల మందు తాగి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు వీరేందర్‌ను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వీరేంద్ర తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు. 
 
తన భార్య సౌజన్య భైరవ అనే వ్యక్తితో సన్నిహితంగా వుండటం చూసి.. భరించలేకే హత్య చేశానని అంగీకరించాడు. ఇక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అలాగే భైరవను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యుడి పనితీరు తగ్గిందట.. భూమికి ప్రమాదం పొంచివుందా?