Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ రైతులకు మరో శుభవార్త... పసుపు-కుంకుమ మూడో చెక్కు కూడా...

ఏపీ రైతులకు మరో శుభవార్త... పసుపు-కుంకుమ మూడో చెక్కు కూడా...
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన మీడియాకు చెప్పారు. దీనితో 30 లక్షలకు పైగా రైతులకు వారి ఖాతాల్లో 39 వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు చెప్పారు.
 
రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. అన్నదాతా సుఖీభవ నిధులు కూడా ఖరీఫ్‌లోగా ఇస్తామన్నారు. మే 23 లోపు ఐదో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబరావు అన్నారు. మరోవైపు పసుపు కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కూడా చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..