Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరికి వరద ప్రవాహం: 50 అడుగులకు చేరిన నీటి మట్టం

bhadrachalam godavari
, బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:06 IST)
గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు50 అడుగులకు చేరింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరడం ఇది నాలుగోసారి.
 
జులై 16న గరిష్ఠంగా 71.3 అడుగులు, ఆగస్టు 12న 52.5, 17న 54.5 అడుగులు మార్కును గోదావరి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 51.60 అడుగులతో 13లక్షల 49 వేల 565 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది. 
 
బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి చత్తీస్​గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు రాకపోకలు బంద్ ​అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కారు