Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలి.. నారా లోకేష్

nara lokesh

సెల్వి

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:33 IST)
పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడేందుకు అనుమతించినందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హిందూ సమాజం మొత్తం గుర్రుగా వుంది. శ్రీవారి తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఎప్పటిలాగే జగన్ మోహన్ రెడ్డికి చెందిన బ్లూ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ప్రారంభించింది. 
 
అయితే వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ సరైన వివరణ ఇచ్చారు. దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాపం చేశాడని, ఆయనను ప్రజలు శిక్షించడం ఇప్పటికే ప్రారంభించారని లోకేష్ ఆరోపించారు. 
 
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అహంకారం, అవినీతితో జగన్ ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు అనుమతించారని లోకేష్ ఆరోపించారు. ఈ చర్యలు బహిర్గతం కాగానే, జగన్ అనుచరులు ఘటనను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు