Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు
, గురువారం, 14 అక్టోబరు 2021 (17:35 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రూ. 147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు.

ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు  తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఏ ప్రజలు అయితే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో.. అదే ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందన్నారు.

ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు మద్యం చాటున ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐవరీకోస్ట్ లో ఎమ్మెల్యే ద్వారంపూడి గోడౌన్లు నిజమేనా?: వర్ల రామయ్య