Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

Advertiesment
Minister
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:29 IST)
శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ద‌ర్శ‌నానంత‌రం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.  
 
నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 6వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు అమ్మవారు 6వ రోజు కాత్యాయిని దేవి రూపంలో దర్శనమిచ్చారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర క్షేత్రాన్ని  ద‌శ‌ల‌వారీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మించామన్నారు. మ‌రో 42 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఆలయ విస్తరణ పనులలో బాగంగా క్యూ కాంప్లెక్స్ గోదావరి న‌ది స‌మీపాన వాష్ రూం ల‌తో పాటు  టిటిడి అతిథి గృహాన్ని  పనులు చేస్తామని అన్నారు. బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని... భక్తులకు ఎలాంటి  ఇబ్బందులు క‌ల‌గ‌కుండా  సౌక‌ర్య‌లను మ‌రింత మెరుగుప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. మంత్రి వెంట జడ్పి చైర్ పర్సన్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా