Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
, మంగళవారం, 19 మే 2020 (05:58 IST)
రైతు సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  సోమవారం రాయచోటి పట్టణంలో వేరుశనగ విత్తన పంపిణీ ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలోను రైతులకు ఇబ్బందులు కలగకుండా   వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.

నియోజక వర్గానికి18290.4 క్వింటాళ్ల  వేరుశనగ విత్తనాలును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు.40 శాతం సబ్సిడీతో విత్తనాలు అందుతాయన్నారు.30 కేజీ ల బస్తా  ధర  రూ.1413 రూపాయలన్నారు. గ్రామ సచివాలయల వద్దనే విత్తనాల పంపిణీ జరుగుతుందన్నారు. గతంలో మాదిరి విత్తనాల కోసం నిరీక్షణ, కష్టాలు ఇక వుండవన్నారు. 

వేరుశనగ  పంట వేయాలనుకున్న ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పంపిణీ ని పారదర్శకంగా  చేపట్టాలన్నారు. ప్రభుత్వం  వేరుశనగ కు మద్దతు ధర రూ.61 ప్రకటించి నియోజక వర్గ వ్యాప్తంగా 6730.15 క్వింటాళ్ల వేరుశనగ ను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.

వర్షాలు సంవృద్దిగా కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విత్తన పంపిణీ లో ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరోనా నేపథ్యంలో  భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీ కృష్ణ, ఏ పి సీడ్స్ జిల్లా మేనేజర్ శివజ్యోతి, రాయచోటి వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు సావిత్రి, వ్యవసాయ శాఖాధికారి దివాకర్,జెడ్ పి టి సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి,

మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి,సింగిల్ విండో అధ్యక్షుడు బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఆసీఫ్ అలీఖాన్, వైఎస్ఆర్ సి పి నాయకులు పల్లపు రమేష్, మదన మోహన్ రెడ్డి, అలీ నవాజ్, హాబీబుల్లా ఖాన్ , కొలిమి హారూన్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వదేశీ - విదేశీ వస్తువులను వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలి : ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం