Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్

ఈఎస్ఐ కుంభకోణం: మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్
, శుక్రవారం, 10 జులై 2020 (18:39 IST)
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే అచ్చెంనాయుడుతో సహా పది మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు మరొకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 
టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పితానీ సత్యనారాయణ వద్ద పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆధ్రప్రదేశ్ సచివాలయం వద్ద ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు.
 
మురళీ మోహన్ ప్రస్తుతం సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈఎస్ఐ కుంభకోణం అరెస్టుల సంఖ్య 11కు చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ఆర్ సీపీ గుర్తింపును రద్దు చేయండి : ఢిల్లీ హైకోర్టులో పిటిషన్